Press ESC to close

7వ తరగతి అర్హతతో తెలంగాణ సింగరేణి కోల్‌ మైన్స్‌లో మహిళలకు ఉద్యోగాలు

7వ తరగతి అర్హతతో తెలంగాణ సింగరేణి కోల్‌ మైన్స్‌లో మహిళలకు ఉద్యోగాలు

తెలంగాణలోని సింగరేణి కోల్ మైన్స్ కంపెనీ చరిత్రలోనే తొలిసారి మహిళలకు మైనింగ్ రంగంలో భారీ యంత్రాల ఆపరేటర్ పోస్టులు ఇవ్వబోతున్నది. 

గరేణి సీఎండీ ఎన్. బలరాం వెల్లడించిన వివరాల ప్రకారం –

అర్హత: కనీసం 7వ తరగతి పాస్ అయి ఉండాలి.

వయస్సు పరిమితి: 35 ఏళ్ల లోపు మహిళా ఉద్యోగులు మాత్రమే దరఖాస్తు చేయవచ్చు.




డ్రైవింగ్ లైసెన్స్: రెండు చక్రాలు లేదా నాలుగు చక్రాల వాహనాలు నడిపే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. (2024 ఆగస్ట్‌కు ముందే లైసెన్స్ పొందిన వారికి ప్రాధాన్యం).

శారీరక సామర్థ్యం: బలమైన శారీరక సామర్థ్యం ఉండాలి.

దరఖాస్తు చేసే మహిళా ఉద్యోగులు గని మేనేజర్, డిపార్ట్‌మెంట్ హెడ్ లేదా జనరల్ మేనేజర్‌కు అప్లికేషన్లు సమర్పించాలి.

ఎంపిక ప్రక్రియలో:

ప్రత్యేక కమిటీ ముందుగా అప్లికేషన్లను పరిశీలిస్తుంది.

ఎంపికైన వారికి సిరిసిల్లలోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్లో ట్రైనింగ్ ఇస్తారు.




ట్రైనింగ్ తర్వాత పరీక్ష నిర్వహించి, ఉత్తీర్ణులైన వారిని సీనియర్ ఎపీ ఆపరేటర్ ట్రైనీ కేటగిరీ-5 పోస్టులకు నియమిస్తారు.

ఈ నిర్ణయంతో సింగరేణి సంస్థ మహిళా సాధికారత దిశగా కొత్త చరిత్ర సృష్టించింది. ఆసక్తి, అర్హత కలిగిన మహిళా ఉద్యోగులు వెంటనే అప్లై చేయాలని యాజమాన్యం పిలుపునిచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *