Press ESC to close

శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్‌

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో గాయపడి సికింద్రాబాద్‌ లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను సినీ నటుడు అల్లు అర్జున్  పరామర్శించారు.  అల్లు అర్జున్ వెంట నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీతేజ్‌ ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు అల్లు అర్జున్. ప్రస్తుతం శ్రీతేజ్‌ కోలుకుంటున్నాడని..  రికవరీ కావడానికి కొంత సమయం పడుతుందని డాక్టర్లు  ఆయనకు తెలిపారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *