
ఏపీలో (విశాఖ) తాజాగా పెట్టుబడులు పెట్టేందుకు మరో కంపెనీ ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో పటిష్టమైన సాంకేతిక పర్యావరణ వ్యవస్థను నెలకొల్పడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా, ఆంధ్రప్రదేశ్లో వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్ (Google) గ్లోబల్ కంపెనీ ఎంఓయూ కుదుర్చుకుంది.

ఎంఓయూపై సంతకాలు చేసిన అధికారులు
ఈ మేరకు అమరావతిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), రాష్ట్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) సమక్షంలో గూగుల్, ఏపీ ప్రభుత్వ అధికారులు ఎంఓయూపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా భారత ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
Delighted to welcome the Google team, led by Sri Bikash Koley, VP, Google Global Networking and Infrastructure, to Amaravati today, alongside Hon’ble Chief Minister @ncbn Garu.
This visit follows the MoU signing on December 5th, strengthening the collaboration between @Google… pic.twitter.com/yCzm0nqQJe
— Lokesh Nara (@naralokesh) December 11, 2024
ఎమ్ఒయు సందర్భంగా అమరావతికి వెళ్లిన గూగుల్ ప్రతినిధి బృందానికి గూగుల్ గ్లోబల్ నెట్వర్క్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (జిజిఎన్ఐ) వైస్ ప్రెసిడెంట్ బికాష్ కోలే (Bikash Koley) నేతృత్వం వహించగా, రాష్ట్ర ప్రభుత్వం తరపున చీఫ్ సెక్రటరీ నిరభ్ కుమార్, పరిశ్రమలు మరియు పెట్టుబడుల కార్యదర్శి యువరాజ్ మరియు ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.


Leave a Reply