హైదరాబాద్లోని బాలాపూర్లో దారుణం చోటుచేసుకుంది. అంతా చూస్తుండగానే ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన బాలాపూర్లోని రాయల్ కాలనీలో చోటుచేసుకుంది. సమీన్ (28)ని రాడ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. కత్తి, రాళ్లు, కర్రలతో దాడి చేశారు. హత్య అనంతరం ముగ్గురు నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
హైదరాబాద్ నడిబొడ్డున అందరూ చూస్తుండగా కత్తులతో పొడిచి హత్య బాలాపూర్ పోలీస్ పరిధిలో రాయల్ కాలనీలో సమీర్ (28) అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి, రాళ్ళు, కర్రలతో కొట్టి దారుణంగా హత్య చేశారు pic.twitter.com/KzP4x1uPPh
— Dailyinfo247News Telugu (@dailyinfo247) June 14, 2024
హత్య సమయంలో ఓ వ్యక్తి వీడియో రికార్డ్ చేశాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి దర్యాప్తు జరుగుతుంది.

Leave a Reply